Advertisement

  • సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలి ..సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ..

సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలి ..సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ..

By: Sankar Thu, 16 July 2020 7:35 PM

సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలి ..సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ..



బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణించి నెల దాటిపోయినా కూడా అతడి గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి ..స్టార్ హోదా ఉన్న నటుడు అంత అర్దాంతరంగా ఆత్మహత్య చేసుకోవడాన్ని చాలామంది నమ్మలేకపొతున్నారు ..అందుకే అతడి మరణంపై సిబిఐ తో విచారణ చేపించాలని అంటున్నారు..తాజాగా సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి కూడా సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరపాలని అమిత్ షా ను ట్విట్టర్ వేదికగా కోరింది ..

రియా ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేసింది ‘‘నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్‌ని.. సుశాంత్ మరణించి నెలరోజులు గడచిపోయింది. నాకు ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకం ఉంది. న్యాయం కోసం దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నేను కోరుకుంటున్నది ఒక్కటే... సుశాంత్ ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఏ ఒత్తిళ్లు కారణమయ్యాయో తెలియాలి..’’ అని ఆమె పేర్కొన్నారు.

కాగా పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సీబీఐ దర్యాప్తు కోరుతూ రాసిన లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంబంధిత విభాగానికి పంపారంటూ.. బీహార్‌కి చెందిన జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పూ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ నుంచి తనకు వచ్చిన రిప్లైని ఆయన ట్విటర్లో పోస్టు చేశారు.

Tags :
|
|

Advertisement