నిహారిక వివాహం... తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్...!
By: Anji Wed, 16 Dec 2020 1:41 PM
రాజస్తాన్లోని ఉయయ్పూర్ ప్యాలెస్లో జరిగిన కొణిదెల వారింటి గారాలపట్టి, సినీ నటి నిహారిక ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో చెప్పనక్కర్లేదు.
అయితే పెళ్లి సందడిలో మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైన సంగతి కూడా తెలిసిందే. చిరంజీవితో సహా మెగా హీరోలాంతా ఫ్యామిలీతో వివాహానికి హాజరయ్యారు.
తమ అభిమాన హీరోలందరిని ఒకే చోట చూసి మెగా ఫ్యాన్స్ పుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, భార్య అన్నాలెజ్నోవా రాకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యతో మాత్రమే హాజరయ్యాడు. దీంతో ఈ అంశంపై పలు రూమర్లు పుట్టుకొచ్చాయి.
హారిక పెళ్లి కోసం తన కొడుకు అకీరా, కుమార్తె ఆద్యతో పవన్ రాజస్థాన్ వెళ్లడంతో రేణు దేశాయ్ని కావాలనే మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందని, ఆమెకు ఆహ్వానం అందలేదు కాబట్టే నిహారిక పెళ్లికి అటెండ్ కాలేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
తాజాగా వీటిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. నిహారిక పెళ్లికి ఆహ్వానం అందలేదనే వార్తలను ఆమె కొట్టిపడేశారు. ‘నిహారిక పెళ్లికి ఆహ్వానం అందింది.
అయితే డిసెంబర్ 9వ తేదీన తనకు షూట్ ఉండటం కారణంగానే ఆ పెళ్లి వేడుకకు రాలేకపోయాను. ఈ పెళ్లిలో పిల్లలిద్దరూ తండ్రితో జాలీగా గడిపారు.
కేవలం షూటింగ్ ఉండటం వల్లే నేను హాజరు కాలేకపోయాను’ అని రేణు క్లారిటీ ఇచ్చి రూమర్లకు చెక్పెట్టారు.