‘క్వీన్’ సినిమాను రీమేక్..తమన్నా తెలుగు, కాజల్ తమిళ వెర్షన్లో...ఓటీటీలో
By: chandrasekar Fri, 24 July 2020 09:05 AM
కాజల్ అగర్వాల్, తమన్నా
వీళ్లిద్దరు హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్గా తెరకెక్కిన ‘క్వీన్’ సినిమాను రీమేక్
చేసారు. తెలుగులో తమన్నా ‘దటీజ్ మహాలక్షి’ పేరుతో రీమేక్ అయితే కాజల్ అగర్వాల్
తమిళ వెర్షన్లో ‘ప్యారిస్ ప్యారిస్’ పేరిట ఈ సినిమా చేసింది. ఎపుడో షూటింగ్
కంప్లీటైన ఈ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్తో విడుదల కాలేకపోయింది.
ఈ సినిమా విడుదలకు ఉన్న
అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమాను త్వరలో ఓటీటీలో విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు
ఈ చిత్ర నిర్మాతలు. కరోనా నేపథ్యంలో చాలా చిత్రాలు ఓటీటీ బాట పట్టాయి. ఇపుడు అదే
రూట్లో ఈ సినిమాలు ఓటీటీలో విడుదల
కానున్నట్టు సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’
సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇక బాలీవుడ్లో మాత్రం పెద్ద సినిమాలే ఓటీటీలో రిలీజ్కు
క్యూ కడుుతున్నాయి.
ఇక హిందీలో హిట్టైయిన
‘క్వీన్’ మూవీని సౌత్లో ఉన్న నాలుగు భాషల్లో రీమేక్ చేసారు. తెలుగు తమన్నా
హీరోయిన్గా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్
చేసాడు. ఇక తమిళంలో కాజల్ హీరోయిన్గా ‘ప్యారిస్ ప్యారిస్’ పేరుతో తెరకెక్కింది
రమేష్ అరవింద్ డైరెక్ట్ చేసాడు. కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్రలో ‘బట్టర్
ఫ్లై’ పేరుతోొ ఈ సినిమా తెరకెక్కింది.
మలయాలంలో మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో ‘జామ్ జామ్’ పేరుతో నిర్మించారు. సౌత్లో
తెరకెక్కుతున్న నాలుగు సినిమాలను పారిస్ నేపథ్యంలోనే తెరకెక్కడం విశేషం. ఈ
సినిమాలన్ని వరుసగా ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.