వరుస చిత్రాలతో దూసుకెలుతున్న రెబల్ స్టార్ ప్రభాస్
By: chandrasekar Mon, 12 Oct 2020 3:23 PM
బాహుబలి సినిమాతో పాన్
ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను చేస్తున్నాడు. అందులో భాగంగా
ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్
సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు
సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ
యాక్షన్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో సెట్స్పైకి వెళ్తుందని సమాచారం. ఈ ఎపిక్ ప్రాజెక్ట్లో
విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్ను వాడనున్నారు. అవతార్, స్టార్
వార్స్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన నిపుణులే ఈ సినిమాకు కూడా పని
చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రీన్ మాట్ టెక్నాలజీలో
చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్
నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్
ప్రకటించారు. ఓం రౌత్ దర్శకత్వంలో సైఫ్ చేస్తున్న రెండో సినిమా ఇది. గత ఏడాది
విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్ కోసం వారిద్దరూ
కలిసి పనిచేశారు. కాగా ఈ సినిమా నుంచి మరో వార్త హల్ చల్ చేస్తోంది.
ఇందులో అజయ్ దేవ్ గణ్
కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. కానీ ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనే
విషయంలో ఇన్ని రోజులుగా క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రంలో ఆయన శివుడి పాత్రలో
కనిపిస్తారని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని
ఆధారంగా తీయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ
సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి
పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో
ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు. అంతేకాక ఆయన విలువిద్య
నేర్చుకుంటున్నాడన్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ వరుస షెడ్యూళ్లతో
బిజీగా ఉన్నాడు. తన రాబోయే చిత్రం రాధే శ్యామ్లో పూజా హెగ్డేతో కలిసి
నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో సినిమాను చేస్తోన్న
సంగతి తెలిసిందే.
మహానటితో సూపర్ పాపులర్
అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ
నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’
చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని
అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే
స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో
నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఇక ప్రభాస్ సరసన
హీరోయిన్గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైనా దీపికా పదుకొనేను ఫైనల్ చేసిన
సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్ బచ్చన్ కూడా ఈసినిమాలో ఓ కీలకపాత్రలో
నటించనున్నాడని చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో
వస్తోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్
ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించారట. దాదాపు 500
కోట్లతో భారీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఎ ఆర్ రహమాన్ సంగీతం అందించే అవకాశం
ఉన్నట్లు సమాచారం.