భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన రష్మిక...ఫిల్మ్నగర్ వర్గాలు షాక్
By: chandrasekar Tue, 27 Oct 2020 11:55 AM
కన్నడ భామ రష్మిక మందానా
తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ
చిత్రాలతో రెండు బ్లాక్బస్టర్ హిట్లు కొట్టిన రష్మిక.. బన్నీ సరసన ‘పుష్ప’లో
ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుండగా.. ఈలోగానే మరో
సినిమాలో అవకాశం దక్కించుకుంది.
తిరుమల దర్శకత్వంలో
శర్వానంద్ హీరోగా కిషోర్ తెరకెక్కనున్న ‘ఆడాళ్ల మీకు జోహార్లు’ సినిమా రష్మికను
ఫైనల్ చేశారు. ఇటీవలే ఆ యూనిట్తో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకుంది రష్మిక.
అయితే ఈ సినిమాలో నటించేందుకు రష్మిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు
సోషల్మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.1.20కోట్లు
డిమాండ్ చేసిందన్న వార్తలతో ఫిల్మ్నగర్ వర్గాలు షాక్కు గురవుతున్నాయి.
కరోనా కష్ట సమయాన్ని
దృష్టిలో పెట్టుకుని నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్లలో కోత విధించాలని
ఇండస్ట్రీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ టైమ్లో రష్మిక భారీ స్థాయిలో
రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందన్న వార్త షాకింగ్కు గురిచేస్తోంది. అయితే ఇది కేవలం
సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి
ఉంది.