Advertisement

  • ఆ పాట ఆయన ఫాన్స్ కు అంకితం ..రాంగోపాల్ వర్మ

ఆ పాట ఆయన ఫాన్స్ కు అంకితం ..రాంగోపాల్ వర్మ

By: Sankar Tue, 21 July 2020 7:47 PM

ఆ పాట ఆయన ఫాన్స్ కు అంకితం ..రాంగోపాల్ వర్మ



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాను సీరియస్ గా తీసుకున్నట్లు తెల్సుతుంది ..ఇటీవల కాలంలో ఏ సినిమా మీద పెట్టనంత స్పెషల్ ఇంట్రెస్ట్ వర్మ పవర్ స్టార్ సినిమా మీద పెట్టాడు ...అయితే ఈ సినిమా ఎవరి మీద తీయలేదు అని చెబుతున్న వర్మ , రిలీజ్ చేసే పోస్టర్లు చూస్తే మాత్రం అది పవన్ కళ్యాణ్ మీద తీస్తున్న సినిమా అని అర్థమవుతుంది ..దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

అయితే మామూలుగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసే ఆర్జీవీని.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడంపై ఆయన స్పందిస్తూ.. ఈ విజయం ‘ప్రవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం’అని ట్వీట్‌ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ‘పవర్‌ స్టార్‌’ సినిమా ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో చూసేందుకు రూ.25 చెల్లించాలని ఆర్జీవీ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ రేపు (బుధవారం) ఉదయం 11 గంటలు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల కానుంది. ఇలా ట్రైల‌ర్ చూసేందుకు డబ్బులు వ‌సూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. రూ.25 చెల్లించి సినిమా ట్రైలర్‌ చూడాలని తాజా ట్వీట్‌లో ఆర్జీవీ మరోసారి స్పష్టం చేశారు. పవర్‌ స్టార్‌ సినిమా జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నారు ఆర్జీవీ.

Tags :
|
|
|

Advertisement