మేము అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాము ..రామ్ గోపాల్ వర్మ
By: Sankar Sun, 05 July 2020 1:53 PM
దేశం మొత్తం మీద కరోనా విజృంబిస్తు సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోతే ..రామ్ గోపాల్ వర్మ కు మాత్రం అలాంటివి ఏమి లేవు అన్నట్లు వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ..వరుసగా సినిమాలతో అందరికి షాక్ ఇస్తున్నారు ..అసలు ఎప్పుడు సినిమా చేస్తున్నాడో ఎక్కడ చేస్తున్నాడో కూడా తెలియకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ..అలా లాక్డౌన్లోనే 'క్లైమాక్స్', 'నేక్డ్' వంటి చిత్రాలను నిర్మించి విడుదల చేశారు కూడా.
వీటితో పాటు గతంలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసును ఆధారంగా తీసుకుని 'మర్డర్', ప్రస్తుతం విజృంభిస్తున్న మహమ్మారిపై 'కరోనా వైరస్', గాంధీ హత్యోదంతంపై 'ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ', ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’, 'పవర్ స్టార్' చిత్రాలను సైతం ప్రకటించారు.. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ యూనిట్లో ఒకరికి కరోనా సోకిందని, దీంతో ఇక ఆయన సినిమాలకు బ్రేక్ పడ్డట్టే అనే వార్తలు రావడం ఒకింత అందరినీ ఆశ్చర్యపరిచాయి
అయితే తాజాగా ఇలాంటి వార్తలపై రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. తమ యూనిట్ అంతా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ''మా యూనిట్లో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందని, ఆ కారణంగా తాము షూటింగ్స్ నిలిపివేశామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. షూటింగ్ ప్రారంభానికి ముందే మేమంతా కరోనా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ షూటింగ్స్ చేస్తున్నాం'' అని వర్మ తెలిపారు.