Advertisement

  • ఆసక్తి రేకెత్తిస్తున్న ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్

ఆసక్తి రేకెత్తిస్తున్న ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్

By: Sankar Sun, 25 Oct 2020 11:59 AM

ఆసక్తి రేకెత్తిస్తున్న ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్


వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ట్రైలర్‌ను విడుదల చేశారు. వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ఈ టీజర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే..ఇక కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అ​యితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు.

కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

Tags :

Advertisement