Advertisement

  • మరొక సంచలన చిత్రానికి తెరతీసిన రాంగోపాల్ వర్మ

మరొక సంచలన చిత్రానికి తెరతీసిన రాంగోపాల్ వర్మ

By: Sankar Sun, 21 June 2020 6:59 PM

మరొక సంచలన చిత్రానికి తెరతీసిన రాంగోపాల్ వర్మ



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే ..కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు..అసలు సినిమాలు ఎప్పుడు , ఎలా తీస్తున్నాడో తెలీదు కానీ వరుసగా సినిమాలుమాత్రం చేస్తున్నడు ..మొన్నటిదాకా మియా మాల్కోవా తో క్లైమాక్స్ , కరోనా వైరస్ మీద కరోనా వైరస్ అంటూ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఒక సంచలన చిత్రాన్ని అనౌన్స్ చేసాడు ..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం అయింది ప్రణయ్ హత్య. భార్య ముందే అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు ప్రణయ్. ఈ హత్యకు ప్రధాన సూత్రదారిగా అయిన అమృత తండ్రి మారుతీ రావుపై కేసు నమోదైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనను కాదని ప్రేమ వివాహాం చేసుకోవడంతో అమృత కళ్ళముందే అల్లుడు ప్రణయ్‌ని మారుతీరావు హతమార్చారని విన్నాం. ఇంతలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ తండ్రీ కూతుళ్ళ ఇష్యూ జనాల్లో పలు చర్చలకు దారి తీసింది.

ఈ రియల్ స్టోరీనే కథాంశంగా తీసుకొని కొత్త సినిమా రూపొందిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి మర్డర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి కుటుంబ కథా చిత్రమ్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వర్మ.


Tags :
|

Advertisement