Advertisement

  • జూ పార్క్ లో ఏనుగును దత్తత తీసుకున్న రాంచరణ్ సతీమణి ఉపాసన ..

జూ పార్క్ లో ఏనుగును దత్తత తీసుకున్న రాంచరణ్ సతీమణి ఉపాసన ..

By: Sankar Tue, 21 July 2020 11:01 AM

జూ పార్క్ లో ఏనుగును దత్తత తీసుకున్న రాంచరణ్ సతీమణి ఉపాసన ..



జూపార్కులోని రాణి అనే ఏనుగును సినీనటుడు రాంచరణ్‌ సతీమణి, అపోలో గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ ఉపాసన కొణిదెల దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు ఏనుగు దత్తత, ఆహారం, ఆరోగ్య సంరక్షణ తదితర ఖర్చులకు రూ.5లక్షల చెక్కును జూపార్కు క్యూరేటర్‌ ఎన్‌.క్షితిజకు సోమవారం అందజేశారు. వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యతగా భావించాలని ఉపాసన పేర్కొన్నారు. జంతువులను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలతోపాటు ప్రముఖులు కూడా ఆసక్తి చూపడం సంతోషకరమని క్షితిజ అన్నారు.

కాగా నిన్న ఉపాసన బర్త్డే సందర్భంగా మెగా అభిమానులు , సెలెబ్రిటీలు ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు ..ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ , ఉపాసన భర్త చెర్రీ త‌న అర్ధాంగికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. "నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి" అని రాసుకొచ్చారు. దీనికి ఉపాస‌న ఫొటో జ‌త చేశారు. అందులో పూల హ‌రివిల్లు మ‌ధ్య కూర్చున్న ఉపాస‌న దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె పేరు గాంచిన విష‌యం తెలిసిందే. మెగా కోడలిగానే గాక ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా ఉపాసన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు సంపాదించారు.

Tags :
|
|

Advertisement