రామ్గోపాల్ వర్మ.. మర్డర్ ట్రైలర్ విడుదల
By: chandrasekar Wed, 29 July 2020 12:27 PM
కరోనా వైరస్ లాక్డౌన్
సమయంలో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క దర్శకుడు రామ్గోపాల్
వర్మ.. క్లైమాక్స్, నగ్నం, తాజాగా
పవర్ స్టార్ అంటూ సినిమాలు తీసిన ఈయన లేటెస్ట్గా తెరకెక్కిస్తోన్న మరో చిత్రం 'మర్డర్'. తెలుగు
రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పలు పోస్టర్స్ను
విడుదలచేసిన ఆయన తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మంగళవారం విడుదల చేశాడు.
ఒక అబ్బాయి, అమ్మాయి
ప్రేమించి పెళ్లి చేసుకోవడం. అది సహించలేని అమ్మాయి తండ్రి అబ్బాయిని హత్య
చేయించడం తర్వాత అమ్మాయి తండ్రి తీవ్రంగా మనోవేదన పడటం అనే సన్నివేశాలను ఈ ట్రైలర్లో
చూపించాడు వర్మ. ఇక ఈ సినిమాపై ప్రణయ్ తండ్రి కోర్టులో ఓ పిటీషన్ వేసిన సంగతి
తెలిసిందే. ఆర్జీవీ 'మర్డర్' సినిమా వల్ల కోర్టులో నడుస్తున్న కేసుపై ప్రభావం పడే
అవకాశం ఉందంటూ అమృత మామయ్య బాలాస్వామి కోర్టులో కేసు వేశారు. అయితే ఈ ప్రణయ్, మారుతీ
రావు కేసుకు సంబంధించి అన్నీ విషయాలు తెలుగు ప్రజలకు తెలిసిందే. అయితే ఇందులో వర్మ
కొత్తగా ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర
దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ చిత్రం
కూడా ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది. ఇక వర్మ ఇటీవల విడుదల చేసిన
పవర్ స్టార్ కూడా పలు వివాదాలకు దారి తీసింది. పవర్ స్టార్ మూవీతో వర్మ చేసిన హంగామా
అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు ఆ మూవీ విడుదల చేసి తన పంతం నెరవేర్చుకున్నాడు వర్మ.
అంతేకాదు ఆ మూవీ భారీ విజయం సాధించినట్లు వరుస ట్వీట్స్ చేస్తూ అదరగొడుతున్నాడు.
పవర్ స్టార్ మూవీ వసూళ్ల లెక్కలు తెలిస్తే కొందరికి గుండెలు పగిలిపోతాయని
చెబుతున్నాడు. ఇంకా ఆయన ట్వీట్స్లో పేర్కోంటూ పవర్ స్టార్ సిరీస్ లో మరో రెండు
సినిమాలు రాబోతున్నాయని షాక్ ఇచ్చాడు.