Advertisement

  • లాక్‌డౌన్ లో ఖాళీ స‌మ‌యాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్న ర‌కుల్

లాక్‌డౌన్ లో ఖాళీ స‌మ‌యాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్న ర‌కుల్

By: chandrasekar Fri, 19 June 2020 12:24 PM

లాక్‌డౌన్ లో ఖాళీ స‌మ‌యాన్ని చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్న ర‌కుల్


క‌రోనా వ‌ల‌న దాదాపు మూడు నెల‌ల పాటు ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ స‌మయాన్ని చాలా మంది స‌ద్వినియోగం చేసుకున్నారు.

సినీ సెల‌బ్రిటీలు ఈ ఖాళీ స‌మ‌యాన్ని చాలా చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకుంటూ ఆన్‌లైన్‌ క్లాసులు అటెండ్ అవ్వ‌డం, కొత్త వంట‌కాలు నేర్చుకోవ‌డం, ఫ్యామిలీతో ఆనంద క్ష‌ణాలు గ‌డ‌ప‌డం వంటివి చేశారు. తెలుగు,త‌మిళం, హిందీ భాష‌ల‌లో బిజీగా ఉన్న ర‌కుల్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ముంబైలో ఉండిపోయింది. 3 నెల‌ల త‌ర్వాత త‌న త‌ల్లితండ్రుల‌ని క‌లిసేందుకు ఢిల్లీ వెళ్లింది.

అక్క‌డ ఇంగ్లీష్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె లాక్ డౌన్‌లో ఏమేం చేసేందో వివ‌రించింది .

తన యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేయ‌డం, వ్యాయామం చేయడం వంటివి కాకుండా ఆన్‌లైన్ ఎంబీఏ తరగతుల్లో కూడా చేరినట్లు నటి తెలిపింది.

అక్కడితో ఆగకుండా, రకుల్ వాణిజ్య విశ్లేషణ మరియు మెరైన్ ఇంజనీరింగ్ ,అనేక ఇతర విషయాలతో పాటు తనను గురించి తాను పూర్తిగా తెలుసుకుంది. ర‌కుల్ ఈ ఖాళీ సమ‌యాన్ని చాలా చ‌క్క‌గా వినియోగించుకుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Tags :
|
|

Advertisement