హైదరాబాద్ కి వచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్
By: chandrasekar Wed, 15 July 2020 10:53 AM
హైదరాబాద్లో రకుల్
ప్రీత్ సింగ్ మొదలు పెట్టిన జిమ్ బిజినెస్ బ్లాక్బస్టర్ అయింది. ఇక్కడే కాదు
విజయవాడ లాంటి నగరాల్లో కూడా రకుల్కు జిమ్ సెంటర్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే లాక్డౌన్కి
ముందు రకుల్ ముంబై వెళ్ళింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు
అక్కడే ఉంది. సడలింపుల తర్వాత కూడా ముంబై దాటి రాలేదు. తమ్ముడు అమన్ ప్రీత్తో
కలిసి అక్కడే ఉంటుంది రకుల్ ప్రీత్. లాక్డౌన్ మూడు నెలలు ఇద్దరూ ఉన్నారు. కలిసి
వండుకుని తిన్నారు. ఆడుకున్నారు కూడా. ఆ తర్వాత ఢిల్లీలోని తమ పేరెంట్స్ దగ్గరకు
వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ బయటికి రావడం
మొదలు పెట్టింది రకుల్.
ఆ మధ్య షూటింగ్ కోసం
కొన్నిరోజులు బయటికి వచ్చింది రకుల్. ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితం అయిపోయింది.
ఇప్పుడు చాలా రోజుల తర్వాత బై రోడ్ హైదరాబాద్ వచ్చింది రకుల్.ఆమెతో పాటు తమ్ముడు
అమన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఆమెకు సొంతంగా ఇల్లు ఉంది.
జూబ్లీహిల్స్లోని లోటస్
పాండ్ సమీపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గర్లోనే రకుల్ ప్రీత్ సొంత ఫ్లాట్
తీసుకుంది. ప్రస్తుతం అక్కడే ఉంది. ముంబైలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండటంతో
ఇక్కడికి వచ్చేస్తున్నారు ముద్దుగుమ్మలు. శృతి హాసన్ కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే
ఉంది.