Advertisement

  • రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రు కుమార్తెలు వెండితెర ఫై ఎంట్రీ

రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రు కుమార్తెలు వెండితెర ఫై ఎంట్రీ

By: chandrasekar Tue, 09 June 2020 4:41 PM

రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రు కుమార్తెలు వెండితెర ఫై ఎంట్రీ


రాజశేఖ‌ర్, జీవితల ముద్దుల కూతుర్లు శివానీ, శివాత్మిక ఒకే ఫ్రేంలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. శివానీ ఇప్ప‌టికే 2 స్టేట్స్ అనే చిత్రంలో అడ‌వి శేష్‌తో క‌లిసి న‌టించ‌గా, ఆ చిత్రం అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది. త్వ‌ర‌లో తేజ స‌జ్జా ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇక శివాత్మిక దొర‌సాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ చిత్రం చేస్తుంది. శివానీ, శివాత్మిక‌లు ఒకే తెర‌పై క‌నిపించ‌నున్నార‌నే వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. గ‌రుడ వేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో ఇద్ద‌రు భామ‌లు ఒకే ఫ్రేమంలో క‌నిపిస్తార‌ని టాక్. జీవిత నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో అఫీషియల్ ప్ర‌క‌ట‌న రావలసి ఉంది.




Tags :

Advertisement