ఎదులూరు గ్రామంలో ఫాంహౌజ్ చేరిన రాజమౌళి
By: chandrasekar Thu, 16 July 2020 6:45 PM
ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి
వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన దర్శకదిగ్గజం. ఈ
క్రేజీ డైరెక్టర్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నాడు. కరోనా కేసులు
పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడే సినిమా
మొదలయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
దీంతో రాజమౌళి తన
ఫాంహౌజ్కు మకాం మార్చినట్టు ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. నల్లగొండ
జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఎదులూరు గ్రామంలో రాజమౌళి భారీ ఫాంహౌజ్ను
నిర్మించుకున్నా డు.
ఆర్ ఆర్ఆర్ షూట్ ఇప్పుడే
షురూ అయ్యే అవకాశాలు లేకపోవడంతో కొంతకాలం ఫాంహౌజ్ లోనే ఉంటూ స్క్రిప్ట్ పనులు
చూసుకోనున్నాడట. ఎంఎం కీరవాణిని తన వెంట తీసుకెళ్లినట్టు ఇన్ సైడ్టాక్.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలయ్యే సమయంలోనే రాజమౌళి తిరిగి హైదరాబాద్ షిప్ట్ అవ్వనున్నాడట.