మహేష్ బాబు చిత్రానికి రాజమౌళి దర్శకత్వం
By: chandrasekar Sat, 23 May 2020 12:05 PM
దర్శక ధీరుడు రాజమౌళి
డైరెక్షన్లో మహేష్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొన్నేళ్లు గా అభిమానులు
ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించారు రాజమౌళి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో
తరువాత సినిమా మహేష్ బాబు తోనే అని ప్రకటించి
అభిమానుల్లో ఆనందం నింపారు. దుర్గ ఆర్ట్స్ బేనర్పై కేఎల్ నారాయణ చిత్రాన్ని
నిర్మించనున్నాడు. ‘దానయ్య గారితో సినిమా తర్వాత నారాయణ గారితో చేయాలి. నారాయణ
గారు, నేను
మహేష్ బాబు కాంబినేషన్ అని ఎప్పట్ని నుంచో చెప్తున్నదే’ అంటూ టీవీ ఛానల్కు
ఇస్తున్న ఇంటర్య్వూలో రాజమౌళి తెలిపారు.
ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల
బడ్జెట్ కేటాయిస్తున్నారని, పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని భారీ రేంజ్లో ప్లాన్
చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాలనే
దిశగా ఆలోచిస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన రెస్పాన్స్ తెలియజేస్తూ ఈ
ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పాలని భావిస్తున్నారట. ఇందుకోసమై తన
తండ్రి పుట్టిన రోజైన మే 31వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం.