- హోమ్›
- వినోదం›
- తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందొద్దు .. సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలపై హీరో మాధవన్ ట్వీట్
తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ చెందొద్దు .. సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలపై హీరో మాధవన్ ట్వీట్
By: Sankar Thu, 16 July 2020 10:27 PM
దేశ వ్యాప్తంగా సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి ..అయితే మార్కులు తక్కువ వచ్చాయి అని కొంత మంది విద్యార్థులు బాధపడే అవకాశం ఉంది..అయితే కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందొద్దంటూ మ్యాడీ తన 10వ తరగతి మార్కులను ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘సీబీఎస్సీ బోర్టు వెల్లడించిన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికి అభినందనలు. నాకు 10వ తరగతిలో 58 శాతం మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి. ఎందుకంటే ఆట అప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’ అంటూ గురువారం ట్వీట్ చేశాడు..
అయితే ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు మాధవన్కు మద్దతునిస్తున్నారు. ‘జీవితంలో అద్భుతాలు చేయడానికి మీ పోస్టు ప్రేరణ’ ‘మార్కులు కేవలం సంఖ్యలు మాత్రమే... పెద్ద సంఖ్య భవిష్యత్తులో దేనికీ హామీ ఇవ్వదు, తక్కువ సంఖ్యతో జీవితం అంతం కాదు.. వీటిని కేవలం మార్కులు గానే చూడాలి. ఇవి కేవలం మార్కులే’ ‘మీరు జీవితంలో ఎదగాలంటే మార్కులు కాదు ముఖ్యం తెలివి, అణకువ, విలువలు, కష్టపడి పనిచేయడం ఉంటే జీవితంలో అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తారు’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు..