సుశాంత్ చివరి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించేందుకు నిర్మాతల నిర్ణయం
By: chandrasekar Fri, 26 June 2020 6:52 PM
సుశాంత్ సింగ్ నటించిన
చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదల తేదీని నిర్ణయించారు. వచ్చే నెల 24 న
విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ
హాట్స్టార్లో విడుదల చేయాలని, సుశాంత్ చివరి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించేందుకు
నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు.
డిస్నీ, హాట్స్టార్
ప్లాట్ఫాం సభ్యత్వం తీసుకోని వారు కూడా ఈ సినిమాను వీక్షించేలా అనుమతి
ఇవ్వనున్నారు. సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' థియేటర్లలో విడుదల అవుతుందా లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో
విడుదల చేస్తారా అన్నది చాలా కాలం పాటు నిర్ణయించలేదు.
సుశాంత్ నటించిన 'డ్రైవ్' సినిమా
విషయంలో కూడా ఇదే జరిగి చివరకు ఓటీటీ లో విడుదలైంది. 'దిల్
బెచారా' నిర్మాణాతర
కార్యక్రమాలు పూర్తిచేసుకొని చాలా కాలంగా విడుదలకు సిద్ధంగా ఉంది. సుశాంత్ పార్ట్
వర్క్ కూడా పూర్తయింది. ఈ చిత్రంలో సంజన సంఘి తొలిసారి ప్రధాన పాత్ర
పోషిస్తున్నది.
సంజన సంఘి గతంలో 'రాక్స్టార్', 'ఫుక్రీ
రిటర్న్స్' వంటి కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. ఈ
సినిమా సంజన సంఘికి హీరోయిన్గా మొదటి చిత్రం. 2012లో విడుదలైన హాలీవుడ్
చిత్రం 'ది
ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు రీమేక్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాస్టింగ్
దర్శకుడిగా చాలా కాలంగా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ముఖేష్ ఛబ్రా దీనికి
దర్శకత్వం వహించారు.
సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ
చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తొలుగ 'కిజ్జీ మరియు మైనీ' పేరు
పెట్టిన నిర్మాతలు.. కొంత కాలం తరువాత పేరు మార్చారు. ఈ సినిమా కథను అమితాబ్
భట్టాచార్య రాశారు.