Advertisement

నాకు ఓటిటి అంటే ఏంటో తెలియదు ..బండ్ల గణేష్

By: Sankar Mon, 27 July 2020 2:44 PM

నాకు ఓటిటి అంటే ఏంటో తెలియదు ..బండ్ల గణేష్



ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన బండ్ల గణేష్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి ఒక్క సరిగా టాప్ ప్రొడ్యూసర్ అయిపోయాడు ..ఇటీవల కాలంలో నిర్మాతగా మాత్రమే కొనసాగుతున్న బండ్ల , చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఒక పాత్రలో నటించాడు ..అయితే ఇటీవల కాలంలో ఈ ఓటిటి ల హావ , కరోనా వంటి అంశాల మీద ఒక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ...

ఈ ఓటీటీ గీటీటీల గురించి నాకు తెలియదు. నాకు తెలియని విషయం గురించి నేను మాట్లాడను. నేను కనుక సినిమా తీసి ఉండి.. రిలీజ్‌కి రెడీగా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ చేసేవాడిని కాదు.ఇక ప్రేక్షకులు ఎవరూ థియేటర్స్‌కి వచ్చి సినిమాలు చూడరు.. అంతా ఓటీటీలదే హవా అని అన్నారు.. ఓరి పిచ్చోడా!! మన ఇంట్లో కూడా దేవుడి ఫొటో ఉంటాది.. అలాగని గుడికి వెళ్లడం మానేస్తామా?? గుడికి వెళ్తాం.. ఎందుకు అంటే గుడికి వెళ్తే ఆ ఫీలింగ్ వేరు. అలాగే మంచి సినిమా వస్తే థియేటర్‌కి వెళ్లి మాత్రమే చూస్తాం.. అందులో ఉండే కిక్ అలాంటిది. మా ఇంట్లో పెద్ద హోం థియేటర్ ఉంది.. అయినా థియేటర్‌కి వెళ్లి చూస్తేనే సినిమా చూసినట్టు ఉంటుంది.

ఇక నేను ప్రొడ్యుసర్‌గానే కొనసాగాలని అనుకుంటున్నా.. ఎమోషనల్ క్యారెక్టర్స్ వస్తే తప్పుకుండా చేస్తా. ఇలాంటి పాత్రలు వస్తే చేస్తా. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అనవరసంగా నటించానని అనుకున్నా.. అదే చెప్పా.. కాని సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు అనీల్ రావిపూడి నా సొంత బ్రదర్ లాంటి వాడు.. మహేష్ బాబు కాంబినేషన్‌లో నటించడం గొప్ప విషయమే కాని.. ఆ వేషం నేను వేయకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.

కరోనా గురించి మాట్లాడుతూ కరోనా ముందు కంట్రోల్ అవ్వాలి.. తొందరగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలి. కొన్నాళ్లు పాటు బాధలు ఉంటాయి.. అవి తప్పువు. తొందర్లోనే వాటి నుంచి బయటపడతాం. కరోనాని కూడా తొందర్లో మరిచిపోతాం.. ఎప్పుడో రెండేళ్ల క్రితం కరోనా వచ్చింది.. థియేటర్‌కి వెళ్ల కూడదు అని ఎవరూ అనుకోరు అని ఈ యాక్టర్ కం ప్రొడ్యూసర్ వ్యాఖ్యానించాడు

Tags :
|

Advertisement