Advertisement

  • శ్రీ మంగం హీరోగా ‘ప్రణవం’ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌కు సన్నాహాలు

శ్రీ మంగం హీరోగా ‘ప్రణవం’ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌కు సన్నాహాలు

By: chandrasekar Sat, 08 Aug 2020 11:57 AM

శ్రీ మంగం హీరోగా ‘ప్రణవం’ చిత్రం ఓటీటీ ద్వారా విడుద‌ల‌కు సన్నాహాలు


శ్రీ మంగం, శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరో హీరోయిన్లుగా కుమార్‌ జి. దర్శత్వంలో తనూజ‌.ఎస్‌ నిర్మిస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘ప్రణవం’. ప‌ద్మారావ్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్పటికే విడుద‌లయ్యాయి. చాలా కాలం త‌ర్వాత ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్, ఉష క‌లిసి ఈ సినిమలో ఓ పాట‌ను పాడ‌టం విశేషం. సునీత‌, అనురాగ్ కుల‌క‌ర్ణి పాడిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుద‌ల‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా ‘ప్రణవం’ చిత్రం నిర్మించాం. మ‌రో మారు హీరోగా శ్రీ త‌నేంటో నిరూపించుకునేలా ఈ సినిమా రాబోతుంది. ఇక ద‌ర్శకుడు కుమార్‌కి ఇది తొలి సినిమా అయిన‌ప్పటికీ ప్రేక్షకుల ఆలోచ‌నా విధానానికి త‌గ్గట్టుగా తెర‌కెక్కించారు. ప్రస్తుతం కొత్త క‌థ‌ల‌తో పోటీప‌డి సినిమాలు చేస్తోన్న ద‌ర్శకుల జాబితాలో మా ద‌ర్శకుడు కూడా చేర‌తారన్న న‌మ్మకంతో ఉన్నాం. క‌థ‌కి త‌గ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించాం. పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఓటీటీ ద్వారా మా చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు.

జెమిని సురేష్‌, నవీన, జబర్దస్త్‌ బాబి, దొరబాబు, సమీర, తదితరులు నటించిన ఈ చిత్రానికి అజయ్ కొరియోగ్రాఫర్‌. శ్రావణ్ నల్లూరి కో-డైరక్టర్‌. మార్గల్‌ డేవిడ్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఎడిటర్‌ సంతోష్‌. దేవరాజ్ ఫైట్స్‌ కంపోజ్ చేశారు. కరుణ కుమార్, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు సాహిత్యం అందించారు.

Tags :

Advertisement