వెబ్ సిరీస్ లో నటించేందుకు పచ్చ జెండా ఊపిన ప్రకాష్ రాజ్
By: Sankar Thu, 02 July 2020 12:56 PM
కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో సినిమా ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది ..షూటింగ్లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి ..సినిమా హాల్స్ కూడా మూత పడటంతో నిర్మాతలు బాగా దెబ్బతిన్నారు ..అయితే ఇదే సమయంలో ఓటిటి మార్కెట్ బాగా విస్తరించింది ..అందరూ చేతిలో స్మార్ట్ ఫోన్ కలిగి ఉండటంతో ..అమెజాన్ , నెట్ఫ్లిక్స్ వంటి యాప్స్ కు బాగా డిమాండ్ ఏర్పడింది ..దీనితో పెద్ద పెద్ద హీరోలు , హీరోయిన్లు చేసిన సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ఫారంలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు ..దీనితో ఇప్పుడు స్టార్స్ అందరూ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ లో ప్రచారం అయ్యే వెబ్ సిరీస్లలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ...
తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు ..ప్రకాష్ రాజ్ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి రచయిత, దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ధోని’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్కి రచయితగా చేయడంతో పాటు ఇందులో ఒక లీడ్ రోల్ కూడా చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే.
ఇదిలా ఉంటే.. ఈ లాక్డౌన్లో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా వలస కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లడానికి ఆయన సహాయం చేశారు. 44 మంది వలస కార్మికులకు తన ఫామ్హౌస్లో బస కల్పించి, వాళ్లంతా తమ ప్రాంతాలకు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేశారు. ‘భరత్ అనే నేను’లో మహేశ్బాబు ‘ఐయామ్ నాట్ డన్ ఎట్’ అని ఓ డైలాగ్ చెబుతారు. అలాగే సేవా కార్యక్రమాల పరంగా ‘ఐయామ్ నాట్ డన్ ఎట్’ అంటున్నారు ప్రకాష్రాజ్. ఇంకా ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.