టీ సిరీస్ నిర్మాణంలో మరొక స్టార్ హీరోతో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్న ప్రభాస్...
By: chandrasekar Thu, 06 Aug 2020 11:46 AM
యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాకు
నెగిటిల్ టాక్ వచ్చినా మొత్తానికి రూ. 400
కోట్లు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో అందిరికీ తెలిసేలా చేసింది. ఈ
సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడికల్
బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అనుకున్నంత రేంజ్లో
లేదని ప్రభాస్ ఫ్యాన్స్ బహిరంగంగా
విమర్శలు చేసారు.
ఈ సినిమా తర్వాత నాగ్
అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో సోషియో ఫాంటసీ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణే నటిస్తోంది.
దీంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఆకాశాన్ని అంటింది ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్
ఇప్పటి నుంచి యేడాదికి మినిమం రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఇప్పటికే రాధాకృష్ణ
దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్
మూవీకి ఓకే చెప్పాడు. తాజాగా ప్రభాస్ యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో డైరెక్ట్ బాలీవుడ్
మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు బాలీవుడ్
వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి అంటే మనకు ముందుగా ప్రభాస్ గుర్తొస్తాడు. రాజు అంటే
ఆయనే అన్నట్లుగా ఈ చిత్రంలో నటించాడు. కానీ ఈ చిత్రంలో ముందు ప్రభాస్ కాదు హృతిక్
రోషన్ను అనుకున్నాడు రాజమౌళి. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని హిందీలో చేద్దామని
హృతిక్ కోసం ట్రై చేసి నిరాశ పడ్డాడు.
తర్వాత ప్రభాస్ ఎంట్రీ
ఇచ్చాడు. పైగా తన కొడుకును రాజుగా చూడాలని ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు కూడా
చత్రపతి టైమ్లో రాజమౌళికి చెప్పాడు. ఈ చిత్రాన్ని ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ
సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించనున్నారట.
ప్రభాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ
సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్గా ప్రకటించే అవకాశం ఉంది.
అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే యేడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.