ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..
By: Sankar Sun, 19 July 2020 12:00 PM
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశ మొత్తం ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ..బాహుబలికి ముందు టాలీవుడ్లో స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్న ప్రభాస్ , బాహుబలి తర్వాత కేవలం టాలీవుడ్ లోనే గాక దేశం మొత్తంలో కూడా ఒక స్టార్ హీరో స్టేటస్ సంపాదించాడు ..దీనితో ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా దర్శక నిర్మాతలు చూసుకుంటున్నారు ..అందుకే ప్రభాస్ ఇంతకుముందు నటించిన సాహూ సినిమాలో అన్ని బాషల నుంచి నటులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ..
తాజాగా ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ..వైజయంతీ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీదత్ పాన్ వరల్డ్ మూవీగా రూపొందించనున్నారు. ఈ సినిమా నుంచి జూలై 19న ఉదయం 11 గంటలకు అదిరిపోయే అప్డేట్ ఉండబోతుందని వైజయంతీ మూవీస్ ఆదివారం ట్వీట్ చేసింది.
అప్పటి నుంచి అభిమానుల ఉత్సాహం అంతా ఇంతా కాదు. డార్లింగ్ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. 21వ సినిమాలో ప్రభాస్తో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే నటించనుంది. దీపికకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం..ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ..దీనితో సాహూ తర్వాత మళ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తోనే ప్రభాస్ నటించనున్నారు..