Advertisement

  • బాలీవుడ్‌ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న ప్రభాస్

బాలీవుడ్‌ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న ప్రభాస్

By: chandrasekar Tue, 07 July 2020 4:55 PM

బాలీవుడ్‌ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న  ప్రభాస్


బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాకు నెగిటిల్ టాక్ వచ్చినా ఓవరాల్‌గా రూ. 400 కోట్లు కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో అందిరికీ తెలిసేలా చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.

ఐతే బాహుబలి తర్వాత రెండేళ్లు ‘సాహో’కే కేటాయించాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాను కూడా సాగతీస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అలనాటి కాలానికి సంబంధించిన హాస్పిటల్ సెట్‌‌ను రూపొందించనున్నారు. దీని కోసం రూ. 5 కోట్లను ఖర్చు పెట్టనున్నట్టు సమాచారం.

ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్ ఇప్పటి నుంచి యేడాదికి మినిమం రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీకి ఓకే చెప్పాడు.

త్వరలోనే ఈ చిత్రం కూడా పట్టాలెక్కనుంది. తాజాగా ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో బాలీవుడ్‌ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికీ ఓకే చెప్పాడు. ప్రభాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా వచ్చే యేడాది పట్టాలెక్కనుంది.

Tags :

Advertisement