Advertisement

  • ఆదిపురుష్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో తెలిసింది

ఆదిపురుష్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో తెలిసింది

By: chandrasekar Wed, 19 Aug 2020 12:18 PM

ఆదిపురుష్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో తెలిసింది


తన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ను రెబల్ స్టార్ ప్రభాస్ మంగళవారం ప్రకటించింది అందరికి తెలిసిందే. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా వస్తోంది. 3డి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ చూసి ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని అంతా అంచనా వేశారు. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారేమో అని కూడా అనుకున్నారు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ మైథలాజికల్ డ్రామాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నట్టు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ప్రభాస్ గారిని శ్రీరాముడిగా చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వెండితెరపై గతంలో చాలా కొద్ది మంది నటులు మాత్రమే రాముడి పాత్ర పోషించారు. ‘ఆదిపురుష్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌లో నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.

భూషణ్ కుమార్, ఓం రౌత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా, ‘ఆదిపురుష్’ ప్రభాస్‌కు 22వ సినిమా. ప్రభాస్ 21వ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఇది ప్రభాస్ సొంత చిత్రం. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు.

Tags :
|

Advertisement