Advertisement

  • వైరల్ న్యూస్: ప్రభాస్, అనుష్కలకు వివాహం జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు...!

వైరల్ న్యూస్: ప్రభాస్, అనుష్కలకు వివాహం జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు...!

By: Anji Mon, 05 Oct 2020 3:36 PM

వైరల్ న్యూస్:  ప్రభాస్, అనుష్కలకు వివాహం జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేశాడు...!

టాలీవుడ్ లో బిల్లా మూవీ నుంచి మొన్నటి సెన్సేషనల్ చిత్రం బాహుబలి 2 వరకు జంటగా కనిపించారు ప్రభాస్, అనుష్క. ఈ జంట చూసి అప్పట్లో వీరి వివాహం జరగబోతుందని ఎన్నో కామెంట్స్ వినిపించాయి. అయితే వీరి వివాహం విషయంలో ఎన్నో సార్లు ప్రభాస్, అనుష్క క్లారిటీ ఇచ్చారు. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని పెళ్లి విషయంలో వచ్చేవన్నీ రూమర్లే అంటూ చెప్పారు.

తాజాగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానంటూ, ఓ సెషన్ ను అనుష్క నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెకు పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలా ప్రశ్నలు ప్రభాస్ తో ముడిపెడుతూనే రాగా, అనుష్క తనదైన శైలిలో తెలివైన సమాధానాలను ఇచ్చింది.ఓ అభిమాని, "ప్రభాస్ తో మీ జోడీ బాగుంటుంది. ప్రతి ఒక్కరూ మీ జంటను ఇష్టపడతారు.

మరో మూవీ చేయండి" అని కోరగా, "ఏదైనా కథకు తన అవసరం ఉందని వస్తే, నేను తప్పకుండా ప్రభాస్ తో ఇంకో సినిమా చేస్తాను అంటూ సమాధానం ఇచ్చింది. మరో అభిమాని, ప్రభాస్, అనుష్కలకు వివాహం జరుగుతున్న సినిమా పిక్ ను పోస్ట్ చేస్తూ, దీనికి సమాధానం చెప్పాలని కోరాడు.దీనికి సమాధానం ఇస్తూ, "ఇది ఓ సినిమా కోసం తీసిన చిత్రం.

షాట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 'మిర్చి' సినిమాలోనిది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నా మనసుకు ఎంతో నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఓ అందమైన పోస్టర్" అని చెప్పింది.

Tags :

Advertisement