ప్రభాస్ నుంచి మరొక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ..ఆదిపురుష్
By: Sankar Tue, 18 Aug 2020 08:25 AM
బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి ప్రాజెక్ట్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ అనే చిత్రం చేస్తున్న ప్రభాస్ .. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ చేయనున్నాడు. ఇందులో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుంది.
గత రాత్రి ప్రభాస్ తన ఫ్యాన్స్కి మేజర్ అప్డేట్ ఇస్తా అని చెప్పారు. అన్నట్టుగానే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. “తనాజీ” దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే భారీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు ప్రకటించారు ప్రభాస్. ఇందుకు సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేయగా, ఇందులో “ఏ” అనే ఆంగ్ల అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో కామికల్ కనిపిస్తున్న హనుమాన్, విల్లు పట్టుకొని ఉన్న రాముడు అలాగే ఆ కింద పది తలల రావణునిలా ఉన్న మరో డిజైన్ ను ను సహా బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంచారు.
టైటిల్ చూస్తుంటే ఈ చిత్రం కూడా హై టెక్నికల్ వాల్యూస్తో మరో పాన్ ఇండియా సినిమా అని ఇట్టే అర్ధమవుతుంది. భారీ 3డీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించనున్నారు. టీ-సీరిస్ బ్యానర్పై భూషణ్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషల్లో తెరకెక్కించనున్నారు