ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్లుక్ను జూలై 10న విడుదల
By: chandrasekar Thu, 09 July 2020 6:46 PM
తమ అభిమాన హీరో రెబల్
స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఒక అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా
ఉన్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న
ప్రభాస్ 20వ
సినిమా ఫస్ట్లుక్ను జూలై 10న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ
క్రియేషన్స్ బుధవారం ప్రకటించింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్
ద్వారా చిత్ర టైటిల్ను కూడా ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే, ఫస్ట్
లుక్ పోస్టర్ విడుదల ప్రకటనలోనే చిత్రంలో నటించిన తారాగణం, సాంకేతిక
నిపుణుల వివరాలను కూడా నిర్మాతలు వెల్లడించారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా
నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ
నటిస్తున్నట్టు ఇప్పటికే ఖరారైంది. ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నట్టు
తెలుస్తోంది.
ఈ విషయంలో ఇప్పటి వరకు
భాగ్యశ్రీ కూడా నోరు విప్పలేదు. అలాగే, హాస్యనటుడు ప్రియదర్శి కూడా ఈ సినిమాలో
నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే రివీల్ చేశారు. జార్జియాలో జరిగిన షూటింగ్లో
దర్శి పాల్గొన్నారు. వీరు ముగ్గురు మినహా మిగిలిన తారాగణం గురించి ఇప్పటి వరకు
సమాచారం లేదు. అయితే, ఒక్క ట్వీట్తో మొత్తం లిస్ట్ను బయటపెట్టారు
మేకర్స్. ప్రభాస్ 20వ సినిమాలో సచిన్ ఖేడేకర్, మురళీ
శర్మ, సాషా
ఛేత్రి, కునాల్
రాయ్ కపూర్, సత్యన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు కునాల్
రాయ్ కపూర్కు తెలుగులో ఇదే తొలి చిత్రం. కునాల్ బాలీవుడ్లో పలు చిత్రాల్లో
ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, నటుడు
ఆదిత్య రాయ్ కపూర్కు కునాల్ సోదరుడు. ఇక సచిన్ ఖేడేకర్ తెలుగు సినిమాల్లో
విరివిగా నటిస్తున్నారు. ఆయన, మురళీ శర్మ ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో
కనిపించారు. మరోవైపు, మోడల్ సాషా ఛేత్రి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలో
నటించారు. ‘భీష్మ’ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన తమిళ హాస్యనటుడు సత్యన్ ఈ
చిత్రంలో నటిస్తున్నారు.