Advertisement

బాలకృష్ణ కోపం ఒక్క నిమిషమే ..పోసాని

By: Sankar Mon, 08 June 2020 10:37 AM

బాలకృష్ణ కోపం ఒక్క నిమిషమే ..పోసాని

తెలుగు సినీ ఇండస్ట్రీ మీద బాలకృష్ణ వరుసగా కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యంకు గురి అయ్యారు ..ఇండస్ట్రీ లో విబేధాలు ఉన్న మాట నిజమే కానీ , ఈ సారి ఏకంగా టాలీవుడ్ లో అగ్ర నటుడు అయిన బాలకృష్ణ విమర్శలు చేయడంతో టాలీవుడ్ లో లుకలుకలపై అందరూ ద్రుష్టి సారించారు..అయితే బాలయ్య వ్యాఖ్యలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు పోసాని కృష్ణమురళి

ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన పోసాని.. ‘‘బాలకృష్ణ తిట్టినా ఒక నిమిషమే. ఆవేశ పడినా ఒక నిమిషమే. కోపం పడినా ఒక నిమిషమే. విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి, బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్‌గా తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆయన కేవలం పదవి కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు. నిజాయతీగా ఉంటారు. లంచగొండి కాదు.

వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరూ ఆయన చుట్టుపక్కలకు రాలేదు. రామారావును అడ్వాంటేజ్‌గా తీసుకొని కొడుకులు సంపాదించలేదు. అప్పట్లో ఏ పేపర్‌లో రాలేదు. ఏ కాంగ్రెస్ వాళ్లు కూడా అనలేదు. ఎప్పుడూ అవినీతి అనే మాట లేని మనిషి బాలయ్య. ఆయనకి ఉన్నదల్లా నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు. ఎవ్వడికీ నష్టం కాదు. అంతా చాలా లైట్‌గా తీసుకుంటారు. నేనూ తీసుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.



Tags :
|

Advertisement