ఎన్టీఆర్పై హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్
By: chandrasekar Fri, 29 May 2020 6:08 PM
కరోనా కారణంగా ఎన్టీఆర్ జయంతిని
ఆయన సొంత మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంటి
వద్దే జరుపుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నిన్న ఓ భావోద్వేగ
ట్వీట్తో తన తాతకు ఘన నివాళి అర్పించారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఘాట్
వద్దకెళ్లి హీరోయిన్ పూనమ్ కౌర్ నివాళి అర్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి
చేస్తోంది. అంతేకాదు, ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్ మరింత సంచలనం
రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్తో పూనమ్కు ఎలాంటి సంబంధం లేదు. కానీ సినీ పరిశ్రమలో
హీరోయిన్గా ఉండటమే ఆమెకున్న ఏకైక అనుబంధం. ఎన్టీఆర్ను కులాలు, ప్రాంతాలు, మతాలకు
అతీతంగా అభిమానిస్తారు.
సినీ కుటుంబ సభ్యురాలిగా
ఎన్టీఆర్ను పూనమ్ స్మరించుకున్నారని అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత
ఆమె చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్య దేవుడు. స్వర్గంలో ఉన్న మీరు నన్ను
ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం
బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీ వంటి నేతలు, మీ వంటి నటుల అవసరం ఎంతో ఉంది అని తీవ్ర భావోద్వేగంతో
చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది.