ఇటలీలో ‘రాధే శ్యామ్’ షూటింగ్లో పూజా హెగ్డే....
By: chandrasekar Thu, 08 Oct 2020 5:40 PM
‘రాధే శ్యామ్’ షూటింగ్లో పాల్గొనడానికి ఇప్పటికే
ప్రభాస్ ఇటలీ వెళ్లారు. ఇటలీ వెళ్తూ హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఆయన కెమెరా కంటికి
చిక్కారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్
నేపథ్యంలో తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్కు ముందు జార్జియాలో
షూటింగ్ చేశారు. అక్కడ కూడా ప్రభాస్, పూజా హెగ్డేలపై సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ
ఇప్పుడు లాక్డౌన్ తరవాత ఇటలీలో షూటింగ్ స్టార్ట్ చేశారు. లాక్డౌన్ తరవాత ప్రభాస్
కెమెరా ముందుకు వెళ్లడం ఇదే తొలిసారి. పూజా హెగ్డే మాత్రం బొమ్మరిల్లు భాస్కర్
దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా షూటింగ్లో
పాల్గొన్నారు.
అక్కినేని అఖిల్తో కలిసి
కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ను
పూర్తిచేసుకున్న పూజా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ను పూర్తిచేయడానికి ఇటలీ
వెళ్లారు. ‘రాధే శ్యామ్’ పాన్-ఇండియా ఫిలింగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ
భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. మిగిలిన భాషల్లోకి అనువాదం చేస్తారు.
ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సచిన్ ఖేడేకర్, మురళీశర్మ
ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ను ఇప్పటి వరకు హైదరాబాద్, జార్జియాలో
జరిపారు. ఇప్పుడు ఇటలీలో చేస్తున్నారు. 1970ల్లో యూరప్లో జరిగిన ఒక రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం
రూపుదిద్దుకుంటోంది.