సుశాంత్ సింగ్ మరణంపై పోలీస్ విచారణలో సంజయ్ లీలా బన్సాలి
By: Sankar Tue, 07 July 2020 5:25 PM
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణంతో బాలీవుడ్ లో నేపోటిజం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి ..కావాలనే సుశాంత్ ను సినిమాలలో తప్పించడం వలన అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని అభిమానులు , ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఆరోపించారు ..ఈ క్రమంలో పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసును సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రొడక్షన్ హౌస్లతో సుశాంత్ ఒప్పందాలు.. ఆగిపోయిన సినిమాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో సుశాంత్ నటించాల్సిందిగా సమాచారం. గోలియోం కీ రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాలలో సుశాంత్ ప్రధాన పాత్రలు పోషించాల్సి ఉండగా.. పద్మావత్ చిత్రంలో షాహిద్ కపూర్ పోషించిన రాజ్పుత్ రాజు పాత్రలో నటించాల్సి ఉన్నట్లు సమాచారం. కానీ చివరకు అతడి స్థానంలో మరొకరిని తీసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు దీని గురించి భన్సాలీని ప్రశ్నించారు. డేట్స్ కుదరకపోవడంతోనే సుశాంత్ను ఈ సినిమాల నుంచి తప్పించినట్లు భన్సాలీ వెల్లడించాడు. దాదాపు మూడు గంటల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసులు కుంటుంబ సభ్యులు, స్నేహితులు, సహా నటులతో కలిపి దాదాపు 34 మందిని విచారించారు. వారందరి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది