ఆసక్తికర విషయాలను పంచుకున్న పాయల్ రాజ్పుత్
By: chandrasekar Wed, 08 July 2020 2:43 PM
తొలి సినిమాతోనే టాలీవుడ్
ను ఆకట్టుకున్నారు. ఈ ఒక్క సినిమాతోనే ఆమె పాపులర్ అయిపోయారు. RX 100 సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్పుత్. తొలి సినిమాతోనే
ఆకట్టుకున్నారు. ఈ ఒక్క సినిమాతోనే ఆమె పాపులర్ అయిపోయారు. పాయల్ రాజ్పుత్ అంటే
అందం మాత్రమే కాదు ప్రతిభావంతురాలైన నటి కూడా. ఏ క్యారెక్టర్లోనైనా ఆమె
ఒదిగిపోగలదు.
ఆమె ఇప్పటి వరకు చేసిన
పాత్రలన్నీ అలాంటివే. కాకపోతే,
RX 100 సినిమా తరవాత ఆమె చేసిన చిత్రాలు అంతలా ఆడలేదు.
మరోవైపు, ‘వెంకీమామ’లో
పాయల్ చేసిన పాత్రకు విమర్శలు వచ్చాయి. అయితే, ‘డిస్కోరాజా’లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం పాయల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘5
Ws’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే,
తాజాగా పాయల్ రాజ్పుత్
‘తెలుగు బులెటిన్’ వెబ్సైట్తో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర
విషయాలను పంచుకున్నారు. మాస్ మహారాజా రవితేజ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.
టాలీవుడ్లో రవితేజ, ప్రభాస్ తన ఫేవరేట్ హీరోలని వెల్లడించారు. ఫేవరేట్
హీరోయిన్ తమన్నా అని పేర్కొన్నారు. అయితే, తనకు ప్రభాస్, విజయ్ దేవరకొండ చిత్రాల్లో నటించాలన్నది కల అని
చెప్పారు పాయల్. త్వరలోనే తన కల నెరవేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
అలాగే, దర్శకులు
సందీప్ రెడ్డి వంగ, తేజతో పనిచేయాలని ఉందని పాయల్ అన్నారు. RX 100 డైరెక్టర్ అజయ్ భూపతితో కూడా మరోసారి పనిచేయాలని ఉందన్నారు. ఇక తన కెరీర్
గురించి మాట్లాడుతూ మోడలింగ్ నేర్చుకున్న తరవాత ఢిల్లీ నుంచి ముంబై వెళ్లానని, అక్కడికి
వెళ్లిన కొన్ని రోజులకే హిందీ సీరియల్లో అవకాశం వచ్చిందని పాయల్ చెప్పారు.
సీరియల్స్ నటిస్తోన్న సమయంలోనే పంజాబీ, తెలుగు సినిమా అవకాశాలు వచ్చాయన్నారు.