ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్
By: chandrasekar Wed, 22 July 2020 2:01 PM
పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్
కోసం డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్
తర్వాత పవన్ ఒకేసారి మూడు సినిమాలకు ఓకే
చెప్పాడు. అందులో రెండు సినిమాలు పట్టాలెక్కాయి కూడా. ఈ క్రమంలో ఈ క్రమంలోనే
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’
సినిమాను ‘వకీల్ సాబ్’ టైటిల్తో రీమేక్ చేస్తున్నాడు.
తెలుగులో పవన్ కళ్యాన్
ఇమేజ్కు తగ్గట్టు కమర్షియల్గా కొన్ని మార్పులు చేర్పులు చేసి
తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్,అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్
సరసన హీరోయిన్ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన
రెండు పాటలు, హీరోయిన్తో కొన్ని సీన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఈ
చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు
సంబంధించిన టీజర్ను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేయాలనే ఆలోచనలో
మేకర్స్ ఉన్నారు.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు షూటింగ్స్కు పర్మిషన్స్ ఇవ్వడంతో
వచ్చే నెల నుంచి ఈ సినిమాలో మిగిలిన
పార్ట్కు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత జూలై నుంచి
క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పవన్ కళ్యాణ్ను స్టార్ట్
చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను క్రిష్ స్టార్ట్ చేసాడు.
పవన్ కళ్యాణ్తో రెండు మూడు సీన్స్ కూడా చిత్రీకరించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్
లేని సీన్స్ను డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే పేరుతో పాటు ‘బందిపోటు’ ’గజ దొంగ’ అనే పేర్లను
పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన
ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను రివీల్ చేయనున్నారు.
క్రిష్ దర్శకత్వంలో
తెరకెక్కుతోన్నఈ సినిమా కోహినూర్ వజ్రం
నేపథ్యంలో తెరకెక్కుతోందనే ప్రచారం
జరుగుతోంది. ఈ సినిమాను ముందుగా
నిర్ణయించిన ప్రకారం విదేశాల్లో చిత్రీకరించాలన్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్
కారణంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో ఈ సినిమా షూటింగ్ను
పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను
సెప్టెంబర్లో మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం.