Advertisement

  • ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిక్ కోర్ట్ రూం సన్నివేశం లీక్ పై ఆరా తీస్తున్న నిర్మాతలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిక్ కోర్ట్ రూం సన్నివేశం లీక్ పై ఆరా తీస్తున్న నిర్మాతలు

By: chandrasekar Tue, 30 June 2020 5:39 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిక్ కోర్ట్ రూం సన్నివేశం లీక్ పై ఆరా తీస్తున్న నిర్మాతలు


చాలా విరామం తర్వాత పింక్ రీమేక్ చిత్రం వ‌కీల్ సాబ్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాతే షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నారు. అయితే తాజాగా చిత్రంలోని కోర్టు సీన్‌కి సంబంధించిన పిక్ ఒక‌టి లీక్ అయింది.

వ‌కీల్ సాబ్ సినిమాలో లీక్ అయిన పిక్ కోర్ట్ రూం సన్నివేశం కాగా, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌డ్జితో మాట్లాడుతున్న‌ట్టుగా ఉంది. పిక్ ఎలా లీక్ అయింద‌నే దానిపై నిర్మాత‌లు ఆరాలు తీస్తున్నారు. దీనికి ఎవరు కారణమని ఇంకా తెలియరాలేదు.

గ‌తంలో కూడా ప‌వ‌న్ సినిమా రిలీజ్‌కి ముందు కొన్ని ఫోటోలు, వీడియోలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నివేదాథామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :
|
|

Advertisement