Advertisement

  • పెళ్లి రోజు 3 ర‌కాల ఆవ‌కాయ ప‌చ్చ‌ళ్ళు తిన్నాం: ఉపాస‌న‌

పెళ్లి రోజు 3 ర‌కాల ఆవ‌కాయ ప‌చ్చ‌ళ్ళు తిన్నాం: ఉపాస‌న‌

By: chandrasekar Mon, 22 June 2020 5:23 PM

పెళ్లి రోజు 3 ర‌కాల ఆవ‌కాయ ప‌చ్చ‌ళ్ళు తిన్నాం: ఉపాస‌న‌


జూన్ 14 న రామ్ చరణ్, ఉపాసన వివాహం యానివ‌ర్స‌రీ జ‌రిగింది. వీళ్ళ వివాహం జరిగి ఎనిమిదేళ్ళ‌యింది. 2012లో ఉపాసన మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

పెళ్లి తర్వాత ఈ జోడీ సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవ‌ల యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్న ఈ జంట‌కి అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. యానివ‌ర్సరీని ఘ‌నంగా జ‌రుపుకున్నార‌ని అంతా భావించిన‌ప్ప‌టికీ, వారు మాత్రం మూడు ర‌కాల ప‌చ్చ‌ళ్ళు, అన్నం, చిప్స్ మాత్ర‌మే తిన్నాం, టీవీ చూశాం అని పేర్కొంది ఉపాస‌న.

గ‌త 20 రోజుల సంఘ‌ట‌న‌లతో మేం చాలా క‌ల‌త చెందాం. మా కుటుంబంలో ముగ్గురు పెద్ద‌వాళ్ళ‌ని కోల్పోయాం. సుశాంత్ సింగ్ మ‌ర‌ణం, క‌రోనా కేసులు, దేశానికి ర‌క్ష‌ణగా నిలిచే జవాన్లు ప్రాణ‌త్యాగం చేసారు. ఇవన్నీ మాములు అంశాలు కావు. వారం క్రితం వ‌చ్చిన మా యానివ‌ర్స‌రీని జ‌రుపుకునేందుకు మాలో ఆస‌క్తి లేక ఆ రోజూ చిప్స్‌తో మూడు రకాల ఆవకాయతో పచ్చడి అన్నం తింటూ, టీవీ చూస్తూ గడిసేసాం.

ఆ స‌మ‌యంలో జీవితానికి సంబంధించిన చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఈ ఫోటోలో ఉన్న ప్ర‌తీ వ‌స్తువు మాలోని కొత్త విష‌యాన్ని మీకు తెలియ‌జేస్తుంది అని ఉపాస‌న త‌న పోస్ట్‌లో తెలిపింది.

Tags :
|
|

Advertisement