తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో నెక్స్ట్ మహేష్ బాబు సినిమా..
By: chandrasekar Wed, 05 Aug 2020 10:04 AM
'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత మహేష్ బాబు చాలా గ్యాప్ తీసుకుని
ఇటీవలే కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట అంటూ మరో సినిమాను
ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో షూటింగ్’కు
వెళ్లనుంది. అది అలా ఉంటే ఆయన తన తదుపరి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు
తెలుస్తోంది.
ఇప్పుటికే సినిమా
సినిమాకు చాలా గ్యాప్ రావడంతో తన తరువాత సినిమాను మహేష్ అప్పుడే ప్లాన్ చేశాడు. ఈ
సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వెల్లడించినున్నారు.
అయితే సర్కారు వారి పాట తర్వాత దర్శకుడు రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ సినిమా.
రాజమౌళి కూడా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్
చేసారు.
కానీ రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' కంప్లీట్
చేసి మహేష్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా సమయమే పడుతుంది. అందుకే మహేష్
బాబు ఈ గ్యాప్ లో 'సర్కారు వారి పాట' ఫినిష్ చేసి మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని
తెలుస్తోంది. ఈ క్రమంలో ''ఖైదీ'' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో నెక్స్ట్ సినిమా చేయడానికి మహేష్ సిద్ధమయ్యారని
సమాచారం.
లోకేష్ ప్రస్తుతం తమిళ
స్టార్ హీరో విజయ్ తో ''మాస్టర్'' సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ తన
తదుపరి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారితో చేయడానికి కమిట్ అయ్యాడట. ఇక లోకేష్
సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటాయి. ఆయన గతంలో 'మా
నగరం', 'ఖైదీ' సినిమాలను
తెరకెక్కించాడు. ఈ క్రమంలో మహేష్ బాబు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన
అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.