జూనియర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్ లో కొత్త మూవీ
By: chandrasekar Thu, 17 Sept 2020 12:24 PM
జాతీయ స్థాయిలో సంచలనం
క్రియేట్ చేసిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఒక
సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రియేటీవ్ దర్శకుడితో సినిమా
చేయనున్నాడు అని తెలియగానే టాలీవుడ్ ప్రేక్షకులు సంబరపడ్డారు. తారక్ స్టామినాకు
తగ్గ దర్శకుడు ప్రశాంత్ నీల్ అని
వారిద్దరి మధ్య సినిమా వస్తే అది వండర్ అవుతుంది అని సంతోషడ్డారు. అయితే తారక్
ప్రస్తుతం బాహుబలితో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న
రాజమౌళితో RRR మూవీ చేస్తున్నాడు.
ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోటాపోటీ సీన్స్ ఉంటాయి అని
సమాచారం. రాజమౌళి RRR మూవీ విడుదల కాగానే క్రియేటీవ్ దర్శకుడు త్రివిక్రమ్
శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ అధికారికంగా పేర్కొన్నాడు.
అదే సమయంలో ప్రశాంత్ నీల్
తో కూడా ఒక సినిమా చేయనున్నాడు తారక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్ తారక్ కలిసి చేయనున్న సినిమా బడ్జెట్ ఎంతో
తెలిసిపోయింది. ఈ మూవీని రూ.250 కోట్లతో తెరకెక్కించనున్నారు అని సమాచారం. 2021
సెకండ్ హాఫ్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. కరోనావైరస్ వల్ల
ఏర్పడిని లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ఇటీవలే మళ్లీ
ప్రారంభం అయింది. యష్ హీరోగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ అతి
క్రూరమైన విలన్ అధీరాగా కనిపించనున్నాడు. 2018 లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 దేశ
వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ తరువాత జూనియర్
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలో నటీనటుల పూర్తి వివరాల
కోసం కొద్ది కాలం ఆగాలి. ఈ మూవీ ప్యాన్
ఇండియా మూవీ కావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా
మూవీస్ చేయడం గర్వకారణం అంటున్నారు.