Advertisement

  • నాగ‌బాబు చే ఫొటోను పోస్టు చేశాడు... ఇంకేముంది దుమ్ము రేగిపోయింది..!

నాగ‌బాబు చే ఫొటోను పోస్టు చేశాడు... ఇంకేముంది దుమ్ము రేగిపోయింది..!

By: Anji Sat, 10 Oct 2020 09:53 AM

నాగ‌బాబు చే ఫొటోను పోస్టు చేశాడు... ఇంకేముంది దుమ్ము రేగిపోయింది..!

టాలీవుడ్ లో నిర్మాత, ఆక్టర్ చిరంజీవి తమ్ముడు నాగ బాబు ఈ మధ్య వివాద వార్తలలో ఎక్కువగా నానుతున్నారు. అయితే తాజాగా నిన్న ఎర్నెస్ట్ చేగువేరే వ‌ర్ధంతి. ఆ సంద‌ర్భంగా నాగ‌బాబు చే ఫొటోను పోస్టు చేశాడు. ఇంకేముంది దుమ్ము రేగిపోయింది!

విశేషం ఏమిటంటే.. ఈ పోస్టు తో నాగ‌బాబూ అటూ ఇటూ కాకుండా పోయారు. నిజ‌మైన చేగువేరా భావ‌జాలం అభిమానులు.. కామెంట్ల‌తో రెచ్చిపోయారు. కాషాయ‌వాద పార్టీతో అంట‌కాగే, గాడ్సేను కీర్తించే మీకు చే ఫొటో పెట్టుకునే అర్హ‌త లేదంటూ కొంత‌మంది కామెంట్లు పెట్టారు. చే ఒక సోష‌లిస్ట్, క‌మ్యూనిస్ట్ అని .. మీ రాజ‌కీయ వాద‌మేంటో గుర్తుంచుకోవాల‌ని వారు నాగ‌బాబుకు చుర‌క‌లంటించారు.

విశేషం ఏమిటంటే.. రైట్ వింగ్ వాళ్లు కూడా ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు మీద దుమ్మెత్తి పోశారు. అస‌లు చే గువేరా ఎవ‌రు? అంటూ, అలాంటి వాళ్ల ఫొటోలు ఎందుకు పోస్టు చేస్తున్నారు? అంటూ నాగ‌బాబును త‌ప్పు ప‌ట్టారు! ఇక త‌ట‌స్థులు.. ఇంకెన్ని రోజులు మీరు ప్ర‌ముఖుల ఫొటోల వెనుక దాక్కొంటారు? అని ప్ర‌శ్నించారు. పూలే, మ‌ద‌ర్ థెరిస్సా, గాంధీ, గాడ్సే, సావ‌ర్క‌ర్, మ‌ళ్లీ చే గువేరేనా? అంటూ.. మెగా వేషాల‌ను వారు ఎండ‌గ‌ట్టారు!

'' చే నిలకడ లేని సైద్ధాంతిక వాది కాదు .. నమ్మిన సిధ్ధాంతం కోసం చివరివరకు పోరాటం చేసాడు మహాత్ముడయ్యాడు......చే,సవర్కర్ ఇద్దరి సిద్ధాంతాలు పూర్తి వ్యతిరేకమైనవి రాజకీయం కోసం రెండింటిని వాడుకోవొద్దు....మీ తమ్ముడు గారు ఆల్రెడీ "చే" ను విడిచి పెట్టేసారు మీరు ఇంకా ఎందుకు నటన?'' అని కొంద‌రు, ''లెఫ్టో రైటో.. తెలుసుకో ముందుర?'' అంటూ మ‌రి కొంద‌రు నాగ‌బాబును ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను నిల‌క‌డ‌లేమి రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టారు!

అదేదో త్రివిక్ర‌మ్ సినిమాలో.. శ‌త్రువులు మ‌రెక్క‌డో ఉండ‌రు, ఇంట్లోనే ఆడ‌ప‌డుచుల్లా ఉంటారంటూ ఒక ప‌నికిమాలిన డైలాగ్ ఒక‌టి రాశాడు. అది ఇప్పుడు వ‌ర్తించేలా ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్రం తిట్టించేందుకు నాగ‌బాబు ఉన్న‌ట్టున్నాడు.

Tags :
|

Advertisement