యూట్యూబ్ లో దూసుకుపోతున్న నీ కన్ను నీలి సముద్రం సాంగ్ ..100 మిలియన్ వ్యూస్ క్రాస్
By: Sankar Mon, 03 Aug 2020 5:55 PM
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా రెండు రాష్ట్రాలలో వినిపించిన పాటల్లో ఒకటి నీ కన్ను నీలి సముద్రం ..కరోనా లాక్ డౌన్ కు కొద్దీ కాలం ముందే రిలీజ్ అయినా ఈ పాట లాక్ డౌన్ సమయంలో విపరీతంగా ఆకట్టుకుంది ..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వచ్చిన ఈ పాటలో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నారు ..
యూట్యూబ్ లో ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించింది. మార్చి 2న విడుదల చేసిన ఈ వీడియో సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ మైల్ స్టోన్ ను అధిగమించింది. హిందీ, తెలుగు లిరిక్స్ తో సాగే ఈ పాటను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు లిరిక్స్ ను శ్రీమణి రాయగా..హిందీ లిరిక్స్ ను రఖీబ్ అలమ్ రాశాడు. జావెద్ అలీ, శ్రీకాంత్ చంద్ర పాడారు.
ఈ ఖవ్వాలీ సాంగ్కు జావెద్ అలీ గానం తోడై మళ్లీ మళ్లీ వినాలనిపించేట్లు చేస్తోంది. అలాగే పాటలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ల ఎక్సెప్రెషన్స్ ముచ్చటగా అనిపిస్తున్నాయి. ఈ పాటకు శ్రీమణి, రఖీబ్ ఆలమ్ చక్కని సాహిత్యం అందించారు.అదేవిధంగా మరో పాట 'ధక్ ధక్ ధక్' ఇప్పటివరకూ 18 మిలియన్ వ్యూస్ పైగా సాధించడం గమనార్హం. ఉప్పెనకు దర్శకత్వం వహించడంతోపాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను బుచ్చిబాబు అందించారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.