బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్...!
By: Anji Wed, 21 Oct 2020 12:20 PM
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల అనే చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు.
దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్బికె థియేటర్లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది.
ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 తో నెరవేరబోతోంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈ లుక్ విడుదల కాగానే జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో ఉంది. ఆరో స్థానంలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ను చాటి చెబుతోంది.