త్వరలో కొడుకు అఖిల్ తో కలిసి నాగార్జున మల్టీస్టారర్ మూవీ?
By: chandrasekar Fri, 13 Nov 2020 10:52 AM
త్వరలో కొడుకు అఖిల్ తో
కలిసి నాగార్జున మల్టీస్టారర్ మూవీ తీయనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ మన్మథుడు, కింగ్
నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం అందరికీ
తెలిసిందే. అయితే తర్వాత తాను తీయబోయే సినిమాల్లో కొడుకు అఖిల్ తో కలిసి ఓ
మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ క్రేజీ
మల్టీస్టారర్ సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్
డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నట్లు కూడా తెలుస్తోంది.
చాలా రోజుల క్రితమే దర్శకుడు అనిల్, అక్కినేని నాగార్జున, అఖిల్లకు సరిగా సరిపడే
కథ ఒకటి సిద్దం చేసుకున్నారట. ఈ విషయాన్ని ఈ మధ్యే నాగార్జునాని కలిసి చెప్పారట, సినిమా
కథ కూడా కింగ్ను బాగా ఆకట్టుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి తీసిన మనం
మంచి హిట్ అయినప్పటికీ అందులో అఖిల్ జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు. ఇప్పుడు
మళ్లీ తండ్రీ కొడుకులు కలిసి స్క్రీన్ పంచుకోనున్నారని తెలిసి అక్కినేని అభిమానులు
ఎంతగానో ఆనందిస్తున్నారు.
కానీ ఈ వార్తలు నిజమైతే
బాగుంటుందని అందరూ అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ మల్టీస్టారర్ గురించి నాగార్జున, అఖిల్, అనిల్
రావిపూడి వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలని, ఒకవేళ నిజమే అయితే తొందర్లోనే సినిమా సెట్స్ పైకి
వెళ్లాలని ఆశిద్దాం. ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్
చేస్తున్నారు. తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వీటితో పాటు బంగార్రాజు అనే
సినిమా కూడా షూటింగ్కి సిద్ధమవుతుందట. ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీలో నటిస్తున్న అఖిల్ఈ సినిమా తర్వాత సురేందర్
రెడ్డి డైరెక్షన్లో ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ
ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు
తెలుస్తోంది. అభిమానులంతా ఈ ఇద్దరి సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.