Advertisement

  • ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ ..క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ ..క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

By: Sankar Thu, 04 June 2020 2:37 PM

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ ..క్లారిటీ ఇచ్చిన  నిర్మాతలు


కేజియఫ్ సినిమాతో కన్నడ సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్లో పెంచేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ..అప్పటిదాకా కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం అయిన కన్నడ సినిమా , కేజియాఫ్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది.. తొలి సినిమా ‘ఉగ్రం’తో బ్లాక్ బస్టర్ అందుకుని తానేంటో నిరూపించుకున్నారు. ఇక రెండో సినిమాతో జాతీయ స్థాయిలో గర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’తో బిజీగా ఉన్నారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఈ మధ్య ప్రశాంత్ నీల్ ఊతమిచ్చారు.

kgf,kgf 2,prashanth neel,ntr,tollywood ,కేజియఫ్ సినిమా, పాన్ ఇండియా , లెవెల్లో , దర్శకుడు ప్రశాంత్ నీల్ ,  ఎన్టీఆర్

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ వార్తను పరోక్షంగా ఖరారు చేశారు. ఎన్టీఆర్‌కు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్.. అదే ట్వీట్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘‘మొత్తానికి అణు కర్మాగారం (నూక్లియర్ ప్లాంట్) పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదర!!! ఈరోజు మీకు ఎంతో సురక్షితంగా, గొప్పగా ఉండాలి. త్వరలోనే కలుద్దాం’’ అని తన ట్వీట్‌లో ప్రశాంత్ పేర్కొన్నారు.

ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. గురువారం (జూన్ 4న) ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సెన్సేషనల్ డైరెక్టర్, మనుషుల్లో మాణిక్యం అయిన ప్రశాంత్ నీల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. త్వరలోనే రేడియేషన్ సూట్‌లో కలుసుకోవాలని వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తరఫున ఒక బర్త్‌డే విషెస్ పోస్టర్ కూడా వదిలారు

Tags :
|
|
|

Advertisement