'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు ?
By: chandrasekar Fri, 18 Sept 2020 10:05 AM
రొమాంటిక్ డ్రామా 'రంగ్
దే' నితిన్, కీర్తి
సురేష్ జంటగా నటిస్తున్న సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది.
ఓటిటి ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్న
ఆఫర్స్ అంగీకరించి సినిమాను వాళ్ల చేతుల్లో పెట్టాలా లేక తామే సొంతంగా
ఆర్జీవీ తరహాలో తమ సొంత వెబ్సైట్లో పే
పర్ క్లిక్ ఫార్మాట్లో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
వెంకీ అట్లూరి
దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు
సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది. కి
ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభించింది. ప్రస్తుతం థియేటర్లు మూసివేయడంతో చాలా
మంది ఇంట్లో కూర్చొని ఓటిటి ప్లాట్ ఫాంలలో సినిమాలను ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు.
కానీ పే పర్ క్లిక్తో ఓటిటి ప్లాట్ ఫాంలలో చూడడానికి అదనంగా
చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆడియెన్స్ ఈ సినిమాని చూడడానికి అంతగా ముందుకు
వస్తారా అనే సందేహమే చిత్ర నిర్మాతలను కాస్త సందిగ్ధంలో పడేస్తోంది. తాము
భయపడుతున్నట్టుగా అదేకానీ జరిగితే సినిమా ఎంత బాగున్నా సినిమాకు ఆడియెన్స్ నుంచి
ఆధరణ కరువైతుందనే ఆందోళన నిర్మాతలను వెంటాడుతోందంట.