Advertisement

  • దొంగ స్వామీజీలపై మెగాస్టార్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా

దొంగ స్వామీజీలపై మెగాస్టార్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా

By: chandrasekar Mon, 31 Aug 2020 10:45 AM

దొంగ స్వామీజీలపై మెగాస్టార్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా


కరోనా కారణంగా ఆన్ లాక్ ప్రకటించడంతో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్లకు అవకాశాలు దొరుకుతున్నాయి. అతి త్వరలో చిరు మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో సినిమా రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి కామెడీని కూడా ఎంత బాగా పండిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన హీరోగా బోలెడన్ని కామెడీ సినిమాలు వచ్చాయి. మరోవైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కామెడీ శాతం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. చిరంజీవి సినిమా కోసం అతని అభిమానులు వేచి చూస్తూ వున్నారు.

ఇంతకుమునుపు చిరంజీవిది యాక్షన్ సినిమాలే వచ్చింది కానీ ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో
కామెడీ సినిమా వస్తే థియేటర్లలో నవ్వులే నవ్వులు. ఆ సమయం ఎంతో దూరంలో లేదని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వస్తోన్న సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే చిరంజీవికి స్టోరీ లైన్ నెరేట్ చేశారట. ఇది దొంగ స్వామీజీలపై రాసుకున్న కథ అని అంటున్నారు. అందుకే, కామెడీ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయట. భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తోన్న స్వామీజీలపై త్రివిక్రమ్ ఎక్కుపెడుతున్న బాణం ఈ సినిమా అంటున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ కలిసి గతంలో ‘జై చిరంజీవ’ సినిమాకు పనిచేశారు. అయితే, ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. మరి ఇప్పుడు చిరంజీవిని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

కొన్ని రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తన తరవాత సినిమాను చేయబోతున్నారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతోంది. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. మరోవైపు, చిరంజీవి ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ ఎప్పుడనేది నిర్ధారించలేదు.

Tags :
|

Advertisement