Advertisement

  • వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి తీసిన తొలి ఫోటో

వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి తీసిన తొలి ఫోటో

By: Sankar Wed, 19 Aug 2020 6:42 PM

వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి తీసిన తొలి ఫోటో


నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోను ఆయనే స్వయంగా తీశారు. అంతేకాదు, ఇది ఆయన తీసిన మొదటి ఫొటో. ‘అగ్ఫా3’ కెమెరాతో ఈ ఫొటోను తీశారాయన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరంజీవి తీసిన ఈ మొదటి ఫొటొలో ఐదుగురు చిన్న కుర్రాళ్లు ఉన్నారు. అయితే, ‘‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని చిరంజీవి ఛాలెంజ్ విసిరారు.

చిరంజీవి ప్రశ్నకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆ బాగా తెలిసిన వ్యక్తిని అందరూ గుర్తుపడుతున్నారు. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సరిగ్గా మధ్యలో నిలబడి కుర్రాడు. పవన్ కళ్యాణ్‌ చిన్నతనంలోనూ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బహుశా ఈ ఫొటోను చిరంజీవి మొగల్తూరులో తీసి ఉండొచ్చు. అది కూడా ఇంటి మేడ మీద. ఎందుకంటే, ఫొటోలో వెనుక పెంకుల ఇళ్లులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద వరల్డ్ ఫొటోగ్రఫీ డే రోజున తాను తీసిన తొలి ఫొటోను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో కూడా చూపించారు చిరు.

Tags :
|
|

Advertisement