Advertisement

  • నాకు నచ్చలేదు అని దర్శకుడు ఓకే అన్న కూడా చిరంజీవి గారు వన్ మోర్ టేక్ అన్నారు ..గోపీచంద్ మలినేని

నాకు నచ్చలేదు అని దర్శకుడు ఓకే అన్న కూడా చిరంజీవి గారు వన్ మోర్ టేక్ అన్నారు ..గోపీచంద్ మలినేని

By: Sankar Sun, 12 July 2020 6:55 PM

నాకు నచ్చలేదు అని దర్శకుడు ఓకే అన్న కూడా చిరంజీవి గారు వన్ మోర్ టేక్ అన్నారు ..గోపీచంద్ మలినేని

మెగాస్టార్ చిరంజీవి .తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజ నటులలో ముందు వరుసలో ఉండే నటుడు ..అయన ఏ పాత్ర అయినా చేస్తే అది వంద శాతం పర్ఫెక్ట్ గా వచ్చేందుకు తపిస్తాడు అనే విషయం అందరికి తెలిసిందే ..అయితే అందరివాడు సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీను వైట్ల ఒకే అన్న కూడా చిరంజీవి వన్ మరి టేక్ అన్నారట అది అందుకు ఆలా అన్నారో ఆ రోజు అక్కడే ఉన్న అప్పటి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ , ప్రస్తుత దర్శకుడు గోపిచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు ..

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ..అందరివాడు సినిమాకు చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. ఓ రోజు ఒక సీన్‌ ను షూట్‌ చేశారు. శ్రీనువైట్ల సీన్‌ను ఒకే చేసేశారు. కానీ చిరంజీవి మాత్రం వన్‌ మోర్‌ టేక్‌..వన్‌ మోర్‌ టేక్‌..అని డైరెక్టర్‌తో అన్నారు. సెట్స్‌లో ఉన్నవారికి చిరంజీవి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాలేదు. చిరంజీవి అలా ఎందుకన్నారంటే..తాను (చిరంజీవి) నటించిన షాట్‌తో గోపిచంద్‌ మలినేని సంతృప్తి చెందినట్టు కనిపించలేదని, అందుకే వన్‌ మోర్‌ టేక్‌ చెప్పారని చిరంజీవి చెప్పారు. ఆ సందర్భం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమని గోపీచంద్‌ మలినేని అన్నాడు.

కాగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకుడిగా రవితేజతో క్రాక్ అనే మూవీ తీస్తున్నారు ..ఇప్పటికే ఈ ఇద్దరి కలయికలో వచ్చిన డాన్ శ్రీను , బలుపు ఘన విజయాలను సాధించాయి ..దీనితో హ్యాట్రిక్ విజయం మీద కన్నేశాడు ఈ దర్శకుడు..ఇవి మాత్రమే కాకుండా బాడీగార్డ్‌, బలుపు, పండగ చేస్కో, విన్నర్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు ..

Tags :

Advertisement