మెగాస్టార్ చేసిన చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు..వైరల్ అవుతున్న వీడియో
By: Sankar Mon, 10 Aug 2020 12:08 PM
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తల్లి ముందు మాత్రం ఇప్పటికి కూడా చిన్న పిల్లాడిలాగానే అయితే ఇటీవల కాలంలో ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ అభిమానులను పలు రకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటున్నాడు.ఓ వైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు.
ఆదివారం ఉదయం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ఓ ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు అది విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే విజయవాడలో నిన్న జరిగిన విషాద ఘటనతో కలత చెందిన చిరు.. ఈ వీడియో విడుదలను వాయిదా వేసి, సోమవారం ఉదయం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. చిరు కోడలు ఉపాసన మెగాస్టార్ వంటకి ఫిదా అయినట్టు కామెంట్ పెట్టింది. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.