Advertisement

  • మత్తు పదార్ధాలకు బానిసై యువత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ..మెగాస్టార్ చిరంజీవి

మత్తు పదార్ధాలకు బానిసై యువత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ..మెగాస్టార్ చిరంజీవి

By: Sankar Fri, 26 June 2020 3:19 PM

మత్తు పదార్ధాలకు బానిసై యువత జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ..మెగాస్టార్ చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి తన అసమాన నటనతో సినిమా ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదగడమే కాకుండా తన సేవ గుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ..ముఖ్యంగా తన సినిమా ద్వారా మరియు బయట కార్యక్రమాల ద్వారా యువతకు అనేక సార్లు మంచి సందేశాలను ఇచ్చిన మెగాస్టార్ తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్నారు .. ప్రపంచవ్యాప్తంగా యువత డ్రగ్స్‌కు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును సర్వ నాశనం చేసుకుంటున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిసవ్వటం మనసును కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు..

వెబినార్ ద్వారా చిరంజీవి మాట్లాడుతూ యాంటీ డ్రగ్‌ ప్రచారం చేయటానికి పూనుకున్న పోలీసు వారిని.. డీజీపీ సవాంగ్‌, ఇతర అధికారులు, వెబినార్‌ సమావేశంలో పాల్గొన్న వారందరిని స్వాగతిస్తున్నా. ఎన్నో జన్మల పుణ్య ఫలం మనిష్య జన్మ. అందమైన జీవితాన్ని మత్తుకు బానిసై అస్తవ్యస్తం చేసుకోవటం అవసరమా అని అన్నారు ..

క్షణికానందం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం. మన మీద ఆధారపడ్డ కుటుంబాల్ని వీధిన పడేయటం సమంజసమా. దురలవాట్లకు బానిసైన మిమ్మల్ని చూసి కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి వాళ్ల వైపు నుంచి ఆలోచించండి. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తే ఆనందపడతారా? బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుంది’అని పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement