Advertisement

  • న్యూ లుక్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి

By: Sankar Fri, 11 Sept 2020 04:48 AM

న్యూ లుక్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి


మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు..ఎన్నో మరుపురాని పాత్రలతో అభిమానులను అలరించాడు..అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు..యువ నటులకు ఏ మాత్రం తీసిపోని విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న చిరంజీవి కొత్త కొత్త విషయాలతో అభిమానులను పలకరిస్తున్నారు..

అయితే తాజాగా మెగాస్టార్ ఒక న్యూ లుక్ ను ట్రై చేసాడు..క్లీన్గా గుండు చేసుకొని , చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ట్రిమ్ చేసిన మీసాలు, గెడ్డం.. ఆపై బ్లాక్ గాగుల్స్ చిరంజీవిని హాలీవుడ్ హీరోలా మార్చేశాయి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చిరంజీవి ఇంతకుముందు ఎప్పుడు ఇలా పూర్తిగా గుండు లుక్ లో కనిపించలేదు దీనితో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు , అభిమానుల నుంచి ఈ కొత్త లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది..

ఇక మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. మోషన్ పోస్టర్‌లో ఎర్ర కండువా వేసుకుని, చేతిలో కత్తిలాంటి పదునైన ఆయుధంతో చిరంజీవిని వెనుక నుంచి చూపించారు. ఈ లుక్‌ చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. మరి సినిమా వస్తే ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Tags :
|

Advertisement